
హోరెత్తిన ఉప్పల్
ఈ సీజన్లో ఉప్పల్లో తొలి ఐపీఎల్ మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు.
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో ఉప్పల్లో తొలి ఐపీఎల్ మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. ఆరంభంలో కాస్త పలుచగా కనిపించినా... మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాండ్స్ అన్నీ నిండిపోయాయి. సినీ నటుడు వెంకటేశ్, సుశాంత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంతో పోలిస్తే ఈ సారి మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు బాగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ రాకపోవడంతో... మాస్టర్ను ప్రత్యక్షంగా చూద్దామని ఆశించిన అభిమానులు నిరాశచెందారు.