మూడో రోజూ వరుణుడు... | Duleep Trophy match chased the third consecutive day | Sakshi
Sakshi News home page

మూడో రోజూ వరుణుడు...

Sep 1 2016 12:17 AM | Updated on Sep 4 2017 11:44 AM

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ని వరుణుడు వరుసగా మూడో రోజూ వెంటాడాడు.

న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ని వరుణుడు వరుసగా మూడో రోజూ వెంటాడాడు. భారత్ బ్లూ, రెడ్‌ల మధ్య జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇప్పటివరకూ ఒక్క ఇన్నింగ్‌‌స కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే.

మూడో రోజు బుధవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా బ్లూ తొలి ఇన్నింగ్‌‌సలో 78.2 ఓవర్లలో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 35 పరుగులతో, జాక్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు కేవలం 16.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement