నా విధుల్లో జోక్యం చేసుకోవద్దు: హాకీ కోచ్ పాల్ వాన్ యాస్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధికారులు మళ్లీ చీఫ్ కోచ్ పదవి చేపట్టాలని ఆహ్వానిస్తే... భారత్కు తిరిగి వస్తానని పాల్ వాన్ యాస్ తెలిపారు. తాను చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలగలేదని, తనపై హాకీ ఇండియా అధికారులే వేటు వేసి తప్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను. ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను ఆహ్వానిస్తారని అనుకోను. గతవారమే నాపై వేటు వేశారు. అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నాను. ఏదీ జరిగినా నాకు సమ్మతమే. నా పదవి నుంచి దిగిపోయానని నేనెప్పుడూ చెప్పలేదు. నన్ను తప్పిస్తే నేనేం చేయాలి’ అని ప్రస్తుతం తన స్వస్థలం నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో ఉన్న పాల్ వాన్ యాస్ వివరించారు. ‘చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాలని మళ్లీ కోరితే తప్పకుండా వస్తాను.
అయితే దీనికి ముందు చాలా విషయాలపై చర్చ జరగాలి. నేను ముక్కుసూటి మనిషిని. నా కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నేను మంచి కోచ్ కాదు అని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వ్యాఖ్యానించారని తెలిసింది. తెలియని విషయాలపై బాత్రా అంచనాకు రాకూడదు. హాకీపై ఆయనకు అవగాహన లేదని ఇలాంటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని పాల్ తెలిపారు. ‘రియో ఒలింపిక్స్లో టీమిండియా నుంచి అద్భుతం చేసి చూపించాలనే తాపత్రయంతో చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాను. భారత ఆటగాళ్లతో పనిచేసిన కాలం అద్భుతంగా సాగింది. భారత ఆటగాళ్లందరిలో సహజసిద్ధ నైపుణ్యం ఉంది. తనపై వేటు వేసిన విషయానికి సంబంధించిన పత్రాలను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులకు మెయిల్ చేశాను. వారి ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నాను’ అని పాల్ వాన్ యాస్ వివరించారు.
పిలిస్తే... మళ్లీ వస్తాను
Published Thu, Jul 23 2015 8:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పట్టభద్రుల స్థానానికి 14 మంది నామినేషన్
రిసెప్షన్ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
పేదలకు ఉచితంగా.. కార్పొరేట్ విద్య
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
వైఎస్సార్సీపీలో 70 కుటుంబాల చేరిక
నిన్ను నమ్మలేం బాబూ..!
విజయం మీదే..!
దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్ మాల్స్.. ఏంటివి?
అకాల వర్షం..అపార నష్టం
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement