ప్రసార హక్కులు సమస్య కాదు : షహర్యార్‌ఖాన్ | Broadcast rights are not the problem : saharyarkhan | Sakshi
Sakshi News home page

ప్రసార హక్కులు సమస్య కాదు : షహర్యార్‌ఖాన్

May 14 2015 1:49 AM | Updated on Sep 3 2017 1:58 AM

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణకు ప్రసారకర్తల వివాదం అడ్డంకిగా మారబోదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణకు ప్రసారకర్తల వివాదం అడ్డంకిగా మారబోదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు పోటీగా రానున్న ఎసెల్ గ్రూప్‌కు చెందిన టెన్‌స్పోర్ట్స్ ఈ టోర్నీ హక్కులు  తీసుకోనుందని, దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన, బోర్డు పెద్దలు దాల్మియా, జైట్లీ, ఠాకూర్‌లతో వరుసగా సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement