ఈసీని కలువనున్న వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders To Meet Central Election Commission Today | Sakshi
Sakshi News home page

ఈసీని కలువనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

Mar 11 2019 3:56 PM | Updated on Mar 11 2019 5:26 PM

YSRCP Leaders To Meet Central Election Commission Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల బృందం ఇవాళ (సోమవారం) 6. 30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈసీని కలువనున్న బృందంలో ఉన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిదఫా ఎన్నికల్లో ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్‌ ఒకేరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీని కలువబోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement