336వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan PrajaSankalpaYatra 336th Day Begins | Sakshi
Sakshi News home page

336వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Jan 2 2019 7:34 AM | Updated on Jan 2 2019 10:15 AM

YS Jagan PrajaSankalpaYatra 336th Day Begins - Sakshi

వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.

సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రకొత్తూరు మండలం నారాయణ పురం శివారు నుంచి ప్రారంభించారు.  అక్కడి నుంచి హరిపురం, అంబుగాం మీదుగా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం రాణిగాం, మామిడిపల్లి, పాత్రపురం క్రాస్‌, తరకసాసనం క్రాస్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement