
పాదయాత్రలో మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సైదాపురం మండలం తలుపూరు నుంచి బుధవారం ఉదయం 76వ రోజు పాదయాత్రను జగన్ మొదలుపెట్టారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మలిచేడు క్రాస్, డేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తారు. పొదలకూరు సెంటర్లో బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.