‘మున్సిపోల్స్‌’పై నేడు టీఆర్‌ఎస్‌ కీలక భేటీ

TRS Party Meeting For Preparation Of Municipal Elections - Sakshi

పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top