పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్‌ | Three nominated BJP MLAs denied entry into Puducherry Assembly | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్‌

Mar 27 2018 3:21 AM | Updated on Mar 27 2018 3:21 AM

Three nominated BJP MLAs denied entry into Puducherry Assembly - Sakshi

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ నామినేట్‌ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్‌.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్‌.. స్పీకర్‌ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement