ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని.. | TDP Workers Attack YSRCP Activist In Kuppam | Sakshi
Sakshi News home page

ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని..

Apr 3 2019 12:45 PM | Updated on Apr 3 2019 2:03 PM

TDP Workers Attack YSRCP Activist In Kuppam - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమని, అందుకే జెండాను ఎగరవేశానని..

సాక్షి, చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పచ్చతమ్ముళ్లు బరితెగించారు. తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేశాడని ఓ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడిపై రెచ్చిపోయి చితక్కొట్టారు. రామకుప్పం మండలం రాజుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీపై అభిమానంతో ఓ యువకుడు తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరవేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత నాగేంద్ర అతని అనుచరులు, వైఎస్సార్‌సీపీ జెండాను ఎలా ఎగరవేస్తారని యువకుడిని హెచ్చరించారు. తనకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమని, అందుకే జెండాను ఎగరవేశానని చెప్పాడు. ఈ సమాధానానికి రెచ్చిపోయిన పచ్చతమ్ముళ్లు.. ఇష్టారాజ్యంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా కుటుంబాన్నే లేపేస్తామని హెచ్చరించారు. దీంతో హడలిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement