పార్టీ ఫిరాయిస్తే రూ.40 కోట్లు | TDP Offered Rs 40 Crore To YSRCP MLA | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయిస్తే రూ.40 కోట్లు

Jul 4 2018 9:31 AM | Updated on Aug 20 2018 6:05 PM

TDP Offered Rs 40 Crore To YSRCP MLA - Sakshi

డాక్టర్‌ ఎం. సునీల్‌కుమార్‌‌

సాక్షి, రొంపిచెర్ల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సునీల్‌కుమార్‌ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement