వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు | TDP Activists Joins YSR Congress Party in Chittor District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు

May 27 2018 6:11 PM | Updated on Aug 13 2018 3:11 PM

TDP Activists Joins YSR Congress Party in Chittor District - Sakshi

చిత్తూరు జిల్లా : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్‌సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా వీకోట మండలం కోడి గుట్టపల్లి, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌ గౌడ్‌, పలమనేరు మండల పార్టీ ఇంచార్జి దివికుమార్‌ల ఆధ్వర్యంలో సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరికి చిత్తూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంటు ఇంచార్జ్‌ జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ..ఎన్నికల్లో తినడానికి ఆరు వందలకు పైగా అబద్ధపు హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు ప్రజలు విసిగిపోయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలందరూ నమ్మడం వల్లే ఈ రోజు భారీగా పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారని, ఇది ఒక శుభపరిణామంగా తాము భావిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అవుతుందని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యమని జంగాలపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement