పండుగకూ పస్తులేనా?: టీడీపీ | satyam about trs govt | Sakshi
Sakshi News home page

పండుగకూ పస్తులేనా?: టీడీపీ

Sep 27 2017 2:50 AM | Updated on Sep 29 2018 5:52 PM

satyam about trs govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయకుండా ప్రభుత్వం పండుగ (దసరా) నాడు కూడా పస్తులు ఉంచుతుందా అని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేడిపల్లి సత్యం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటయ్యేదాకా రేషన్‌ ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేదని.. కానీ ఇప్పుడు అన్ని సరుకుల పంపిణీ జరగటం లేదని ఆరోపించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రూ.220 కోట్లు ఖర్చుచేసిన సీఎం.. పేదలకు మాత్రం రూ.50 నాసిరకం చీరలను పంచారని విమర్శించారు. ఇందులో కమీషన్ల పేరిట రూ.150 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించడం లేదని, పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement