పంట నష్టంపై పట్టించుకోరా: పొంగులేటి 

Ponguleti Sudhakar Reddy Fires On TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టంలో కూరుకుపోయి ఉంటే, వారికి పరిహారం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్‌ యార్డుల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, రైతులు పంటలను అమ్ముకునేందుకు రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ హౌజ్‌ కమిటీలు నామమాత్రంగా మారాయని, కమిటీ సమావేశాలపై అశ్రద్ధ సరికాదని, స్పీకర్, చైర్మన్‌లు కమిటీల పనితీరుపై దృష్టి సారించాలని కోరారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top