వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం | Newly elected YSR Congress Party Rajya Sabha members Takes oath | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం

Jul 22 2020 11:14 AM | Updated on Jul 22 2020 12:05 PM

Newly elected YSR Congress Party Rajya Sabha members Takes oath - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక  20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement