మెట్రో రైలు ఘనత వైఎస్సార్‌దే | Metro train is credited to YSR | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు ఘనత వైఎస్సార్‌దే

Nov 27 2017 2:46 AM | Updated on Oct 16 2018 5:04 PM

Metro train is credited to YSR - Sakshi

దోమకొండ (కామారెడ్డి): హైదరాబాద్‌లో మెట్రో రైలు ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా మందాపూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌ కేబినెట్‌లో తాను హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలోనే మెట్రో కోసం ఒప్పందం జరిగిందని, శంకుస్థాపన చేశామని గుర్తుచేస్తూ అప్పటి ఫొటోను చూపించారు. ఆనాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. వైఎస్సార్‌ రోజూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ తన కేబినెట్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సమ యం ఇవ్వడం లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement