నేనెందుకు స్పందించాలి : లోకేశ్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనే తమకు లేదన్నారు. గురువారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన లోకేశ్... కొత్త రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడిన తర్వాత పూర్తికాలం అధికారంలో కొనసాగాలనేది తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో ఇలా జరగకపోవడం విచారకరమని లోకేశ్ సానుభూతి వ్యక్తం చేశారు.
కాగా ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరగనున్నాయంటూ రిపబ్లిక్ టీవీలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవన్నీ కేవలం ఊహాగానాలేని.. వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు.