టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లతో తెలంగాణకు మేలు | Lok Sabha: 16 Mp Seats Will Be Benefitial For Trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లతో తెలంగాణకు మేలు

Apr 6 2019 12:34 PM | Updated on Aug 27 2019 4:45 PM

Lok Sabha: 16 Mp Seats Will Be Benefitial For Trs - Sakshi

రోడ్‌షోలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

సాక్షి, మల్లాపూర్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో తెలంగాణకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ మండలంలోని రేగుంట, గుండంపల్లి, చిట్టాపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుషోల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.  ప్రజల సంక్షేమ కోసం అహార్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. పరిపాలన దక్షత, అద్భుతమైన పనితీరుతో నాలుగున్నర సంవత్సరాల్లోనే సీఎం కేసీఆర్‌ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిపారని కొనియాడారు. 

టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలపై బీజేపీ దుష్ప్రచారానికి దిగుతోందని, సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నుతుందని, ప్రజలు ఆగమం కావోద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పడు జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో దేశంలో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం జరుగబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎనుగు రాంరెడ్డి, సర్పంచ్‌లు కుందేల్ల నర్సయ్య, దనరేకుల మల్లు, ఎంపీటీసీలు బిట్ల నరేష్, కోటగిరి జల, నాయకులు దనరేకుల సంతోష్‌యాదవ్, నిమ్మల భూమారెడ్డి, సురకంటి తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, రంగు రామాగౌడ్, బొడ్డు రాజేష్, తక్కల్ల నరేష్‌రెడ్డి, నూతుల లక్ష్మీనారాయణ, కట్కం నర్సారెడ్డి, నేరేళ్ల మోహన్‌రెడ్డి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement