సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంతా బోగస్ అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన స్థాయి దిగజారి మాట్లాడారని, ఆయన వాడిన పదజాలం, మాటలను తెలంగాణ ప్రజలు హర్షించరని పేర్కొ న్నారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ అనేక విమర్శలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ఢిల్లీనుంచి ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.75 కోట్ల మందికి 25 కిలోల బియ్యం ఇవ్వడం బోగస్ అంటారా అని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణకు ఆస్పత్రులు రావా? లాభం చేకూరదా? ముందుగా ప్రకటించిన ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా? అని ప్రశ్నించారు. ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా? రాష్ట్ర అకౌంట్లో వేస్తేనే ప్రజలకిచ్చినట్లా అని ప్రశ్నించారు.
కేంద్రానికి ఆ ఆలోచన లేదు
రాష్ట్రాలు, దేశం బాగుండాలని ఎఫ్ఆర్బీఎంలో సంస్కరణలు అమలు చేయా లని కేంద్రం అడుగుతోంది తప్ప ఎవరి నెత్తినో కత్తి పెట్టే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. సంకుచిత భావనతో కేసీఆర్ ఉన్నా రన్నారు. తాము చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమని సీఎం కేసీఆర్ రైతుల్ని బెదిరించడం ఫ్యూడలిజం, నియంతృత్వం కాదా? అని ప్రశ్నించారు. సబ్సిడీలు ఇవ్వొ ద్దని చెప్పడం లేదని, లెక్కలు స్పష్టంగా ఉండాలని, ఎవరికి ఎంత ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని కేంద్రం అడుగుతోందని పేర్కొ న్నారు.
దుబారా ఉండొద్దని, అవి నీతిని నిర్మూలించాలని చెబుతోందన్నారు. సంస్కరణలు అంటే ఇవేనన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో ప్రజల కష్టాలు చూడాలే తప్ప రాజకీయాలు వద్దని హితవు పలికారు. ప్రజల కోసం కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే విమర్శిస్తూ బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పశు సంపద కోసం పెట్టే డబ్బు, మత్స్య కార్మికుల కోసం వెచ్చించే డబ్బు తెలంగాణకు రాదా? మీరు నిర్మించిన శీతల గిడ్డంగుల్లో కేంద్ర డబ్బు ఉందో లేదో లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు. శాంతి భద్రత అంశం రాష్ట్ర పరిధిలోనిదని, బైంసా ఘటన విషయంలో రాష్ట్రం అడిగితే పారామిలటరీని పంపిస్తామన్నారు.
ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా?
Published Wed, May 20 2020 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement