
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గన్నవరం ...
విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాబితాలో ఆయన పేరు లేదంటూ.. కన్నా లక్ష్మీనారాయణను విమానాశ్రయం లోనికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోనికి అనుమతించకపోవడంతో సాధారణ ప్రయాణికులు వేచి ఉండే ఎయిర్పోర్టు లాంజ్లో కన్నా లక్ష్మీనారాయణ కూర్చున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. నల్ల జెండాలు, బెలూన్లు, ఖాళీ కుండలతో నిరసన తెలిపారు.