
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కోరారు. సోమవారం ఇడుపులపాయలో వైఎస్సార్ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్ సీపీ తెలంగాణ నాయకులు సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరితోపాటుగా సేవాదళ్ రాష్ట్ర నేతలు బి.వెంకట రమణ, డా.ప్రఫుల్లారెడ్డి, వేముల శేఖర్రెడ్డి యాత్రలో పాల్గొన్నారు.