నిజామాబాద్‌లో ఎన్నికలు వాయిదా వేయాలి | Farmers files Lunch Motion Petition In High Court | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో ఎన్నికలు వాయిదా వేయాలి

Apr 4 2019 12:39 PM | Updated on Apr 4 2019 12:39 PM

Farmers files Lunch Motion Petition In High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు. గురువారం జిల్లా రైతులు అందరు కలసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలని కొరామని తెలిపారు.

ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరిన రైతులు. ఇవాళ మధ్యాన్నం తరువాత నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై విచారించనున్న హైకోర్టు.

Advertisement
 
Advertisement
Advertisement