ప్రమాదకరంగా దేశ రాజకీయాలు | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా దేశ రాజకీయాలు

Published Thu, Apr 12 2018 4:20 AM

Dangerous country politics - Sakshi

ఆసిఫాబాద్‌ క్రైం: దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆసిఫాబాద్‌ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గాలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిరసన తెలిపిన వారిని హింసిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలో భవిషత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement