అవే కొం‍పముంచాయా..? | Congress Raises Questions On EVMs Yet Again | Sakshi
Sakshi News home page

అవే కొం‍పముంచాయా..?

May 15 2018 12:50 PM | Updated on Aug 14 2018 4:46 PM

Congress Raises Questions On EVMs Yet Again - Sakshi

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ఎన్నికల ఫలితాలతో నిరాశచెందిన కాంగ్రెస్‌ మరోసారి ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్ల వినియోగానికి బీజేపీ ఎందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రశ్నించాయి. ‘ఈవీఎంలపై దేశంలోని పార్టీలన్నీ సందేహాలు వ్యక్తం  చేశాయి. గతంలో బీజేపీ సైతం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఎందుకు సిద్ధంగా లేద’ని కాంగ్రెస్‌ నేత మోహన్‌ ప్రకాష్‌ అన్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఓటమి నైరాశ్యంలో ఈవీఎంలను నిందిస్తోందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. కాగా కర్ణాటకలో సాధారణ మెజారిటీ దిశగా బీజేపీ సాగుతోంది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బీజేపీ 111 స్ధానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, కాంగ్రెస్‌ 71 స్ధానాల్లో, జేడీఎస్‌ 38 స్ధానాల్లో, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement