‘అదే తన ప్రపంచం అనుకుంటున్న కేసీఆర్‌’

Congress Leader Shabbir Ali Fires On Cm KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర పట్టించుకోవటం లేదని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టుకు వెళ్లిన తర్వాత అమలుకు సాధ్యం కాదని కేంద్రం చెప్పిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు హామీల అమలుకు కృషి చేయటం మానేశారని విమర్శించారు. రేపు(జూన్‌ 15న) ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నారు కదా.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తుందో అడగండని కేసీఆర్‌కు సూచించారు.

గత ప్రభుత్వం చేస్తా అనడం.. ఇప్పటి ప్రభుత్వం కాదనటం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని ఇదే నా ప్రపంచం అనుకుంటున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌ రాష్ట్ర హక్కులను కాపాడాలని, ముస్లింకి ఇచ్చిన హామీ మేరకు 12% రంజాన్‌ గిఫ్ట్‌ మోదీతో ఇప్పించండి.. లేదంటే ముస్లిమ్స్‌ను క్షమాపణ కోరాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. మాకేమి అవసరం లేదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని సీఎం అన్నారు. సీఎం ఆడిగినట్టు.. మోదీ కేసీఆర్‌ని ప్రేమిస్తున్నారు అని షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top