కాంగ్రెస్‌ను తిట్టడానికే ‘రైతు బంధు’

Congress Leadar Ponnam Prabhakar Slams Cm Kcr - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీని తిట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘రైతుబంధు’ కార్యక్రమం పెట్టినట్టు ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార ఆర్భాటంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ చెప్పినట్టు కాంగ్రెస్‌ నేతలకు మెదడు లేదని, తమకు మెదడే ఉంటే ఆయన ఎలా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.

మరోవైపు తెలంగాణ వ్యతిరేకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరెత్తెడం, గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా సెంటిమెంట్‌గా భావించే కేసీఆర్‌, జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top