భారత్‌ తప్పు చేసిందా? | Congress ask Central government on Jadhav Family Re Unite | Sakshi
Sakshi News home page

Dec 29 2017 1:27 PM | Updated on Aug 25 2018 6:31 PM

Congress ask Central government on Jadhav Family Re Unite   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్య ఆరోపణలపై పాక్‌ జైల్లో బంధీగా ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ను ఎట్టకేలకు ఆయన కుటుంబ సభ్యులు కలుసుకోవటంతో కాస్త ఊరట పొందారు. అయితే ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాదవ్‌ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్‌ ను పాక్‌ అధికారులు అవమానించటం.. మన రాజకీయ పక్షాలెన్నీ ఏకమై పాక్‌ తీరుకు వ్యతిరేకంగా గళం వినిపించటం చూశాం. 

కానీ, పాక్‌ గురించి తెలిసి కూడా కేంద్రం ముందుకు వెళ్లటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదో దౌత్యపరమైన అపజయంగా ఇప్పటికే అభివర్ణించిన కాంగ్రెస్‌ తాజాగా ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత మనీష్‌ తెవారి జాదవ్‌ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూనే.. ఓ సందేశం ఉంచారు. 

1. ఏ ఒప్పందం మేరకు భారత్‌-పాక్‌ ఈ కలయికకు ఏర్పాటు చేశారు.
2. పాక్‌ కుటిలబుద్ధి తెలిసి కూడా దౌత్యానికి భారత్‌ ఎందుకు మొగ్గుచూపింది?. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీఆర్‌సీ పద్ధతి) ద్వారానో లేదా కనీసం, ఐక్యరాజ్యసమితి ద్వారానో ముందుకు వెళ్లాలే తప్ప.. ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుంది?

ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆయన తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.


 
ఇక పాక్‌ విదేశాంగ కార్యాలయం వెలుపల కులభూషణ్‌ జాదవ్‌ తల్లి, భార్యలను పాక్‌ మీడియా ఎలా వేధించాయో కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ టెర్రరిస్టుకు తల్లిగా ఎలా ఫీలవుతున్నారు? అంటూ ఇబ్బందికర ప్రశ్నలతో జాదవ్‌ తల్లిపై పాక్‌ మీడియా ప్రశ్నలు గుప్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement