మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు | BJP MP GVL Comments Dissolution of AP Legislative Council | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం: జీవీఎల్‌

Jan 29 2020 1:58 PM | Updated on Jan 29 2020 2:53 PM

BJP MP GVL Comments Dissolution of AP Legislative Council - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం)

Advertisement
 
Advertisement
Advertisement