బెంగాల్‌: లేడీస్‌ దంగల్‌ | Bengal Ladies Dangal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌: లేడీస్‌ దంగల్‌

Mar 14 2019 9:15 AM | Updated on Mar 23 2019 8:59 PM

Bengal Ladies Dangal - Sakshi

సాక్షి, కోల్‌కతా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 60 మంది మహిళా సభ్యులు గెలుపొందగా, అందులో 12 మంది అంటే 20 శాతం మంది పశ్చిమ బెంగాల్‌ నుంచే కావడం గమనార్హం. దేశంలో బెంగాలీల జనాభా శాతానికి ఇది రెట్టింపు కన్నా అధికం. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థుల్లో 30 శాతానికి పైగా మంది గెలుపొందారు. తృణమూల్‌కు చెందిన ఉమా సోరెన్‌ అత్యంత పేద సభ్యురాలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.5 లక్షల కన్నా తక్కువే. గతంలో కన్నా 2014లోనే అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్‌ 41 శాతం సీట్లను మహిళలకే కేటాయించిన సంగతి తెలిసిందే.   

Advertisement
 
Advertisement
Advertisement