ఉరితీయాలన్నోళ్లే వచ్చారు.. ఇప్పుడు రేవంత్‌! | anyone can join congress: MLC Ponguleti on Revanth | Sakshi
Sakshi News home page

ఉరితీయాలన్నోళ్లే వచ్చారు.. ఇప్పుడు రేవంత్‌!

Oct 21 2017 8:30 PM | Updated on Mar 18 2019 7:55 PM

anyone can join congress: MLC Ponguleti on Revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గతంలో రాజీవ్‌గాంధీని ఉరితీయాలని మాట్లాడినవాళ్లు కూడా తర్వాతి కాలంలో పార్టీలో చేరి ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌లో ఉందని, హైకమాండ్‌ ఆదేశానుసారం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే రావచ్చునని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ హాలులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘‘టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మా పార్టీలోకి వస్తున్నారని అధికారికంగా ఎవరు చెప్పలేదు. పార్టీకి లాభం చేకూరేలా ఎవరు వచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అయితే, గతంలో పార్టీపై చేసిన విమర్శలకు చింతిస్తున్నామని చెప్పి వస్తే కార్యకర్తలు హర్షిస్తారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో రాజీవ్‌గాంధీని ఉరితీయాలని మాట్లాడిన నేతలు కూడా పార్టీలో ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌లో ఉంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.

రిపోర్టును అసెంబ్లీ ముందు పెట్టాలి : అక్టోబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పొంగులేటి కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను సభ ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం కేసీఆర్ ఎందుకు రాజీపడుతున్నారని ప్రశ్నించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న ఖమ్మం జిల్లాను ముంచి కడుతున్న పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పత్తి కొనుగోలుపై సర్కార్ దృష్టి సారించాలని పొంగులేటి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement