పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ | Akbaruddin Owaisi Is PAC Chairman In Telangana | Sakshi
Sakshi News home page

పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

Sep 22 2019 2:49 PM | Updated on Sep 22 2019 5:36 PM

Akbaruddin Owaisi Is PAC Chairman In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది.  ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది. అలాగే అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ‍్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

కాగా పీఏసీ చైర‍్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్‌ పార్టీ... తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement