రైలు ఢీకొని యువకుడు మృతి | Man Died In Train Accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని యువకుడు మృతి

Sep 4 2018 4:48 PM | Updated on Sep 4 2018 4:48 PM

Man Died In Train Accident  - Sakshi

గంగాధర్‌

ఇచ్ఛాపురం రూరల్‌ శ్రీకాకుళం : మండలంలో లొద్దపుట్టి గ్రామానికి చెందిన వ్యక్తిని గూడ్స్‌ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లొద్దపుట్టి గ్రామానికి చెందిన మానసిక వ్యాధితో బాధపడుతున్న పెదిన గంగాధర్‌(42) శనివారం సాయంత్రం పక్క గ్రామమైన జగన్నాథపురం వెళ్లాడు. చీకటి పడటంతో రైలు పట్టాలు దాటుకుంటూ వస్తుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు ఇతడిని ఢీకొనడంతో పాటు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది.

విషయం తెలియని కుటుంబ సభ్యులు రాత్రంతా చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం రైలు పట్టాల పక్కన ఎవరిదో మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా గుర్తుపట్టలేని విధంగా గంగాధర్‌ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామం విషాదంలో మునగిపోయింది. మృతుడికి భార్య జానకమ్మతో పాటు కుమారులు దివాకర్, హరీష్‌ ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement