సెయింట్ లూయిస్లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
సెయింట్ లూయిస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలోని సెయింట్ లూయిస్లో ప్రవాసాంధ్రులు విజయోత్సవ సభ నిర్వహించారు. సెయింట్ లూయిస్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 350 మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరై సంబరాలు జరుపుకున్నారు. మహిళలు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో హోరెత్తించారు. అతిథులందరికీ రుచకరమైనా ఆహారాన్ని అందించిన రామక్రిష్ణారెడ్డి బోరెడ్డి, సూర్య తేజ్, వారి బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తలు