ప్రజాసంకల్పయాత్రకు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

NRIs Wishes YS Jangan mohanreddy - Sakshi

కనెక్టికట్‌ : ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఆమెరికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం కన్వీనర్ రత్నాకర్, స్టేట్ ఇంచార్జి శ్రీనివాస రెడ్డి, రామ్ నరేష్, ప్రదీప్ రెడ్డి, వంశీ, స్టూడెంట్స్ వింగ్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా కేక్‌ కట్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్‌ జగన్‌ గెలిపించాలని కోరారు.

కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందన్నారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top