అయోధ్యలో రాముని భారీ విగ్రహం!

Yogi Adityanath Plans Big Lord Ram Statue On Ayodhya's Saryu River - Sakshi

లక్నో: అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే దీపావళి రోజు ప్రకటించనున్నారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మాట్లాడుతూ.. దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక శుభవార్త చెప్పనున్నారని, అది ఆయన ద్వారానే వింటే బావుంటుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top