కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాల నిర్వహణ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతూండగానే ఉత్తర ప్రదేశ్ చందౌలిలో మరో దారుణం చోటు చేసుకుంది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాల నిర్వహణ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతూండగానే ఉత్తర ప్రదేశ్ చందౌలిలో మరో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మహిళలను నేలపైనే పడుకోమని చెప్పడం సంచలనం సృష్టించింది.
చందౌలి జిల్లా నియమతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న సుమారు 27 మంది మహిళలు బెడ్స్ లేని కారణంగా బాత్రూం పక్కనే ఉన్న నేలపై పడుకోవాల్సిన దుస్థితిని కల్పించారు. దీంతో ఆ మహిళల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. తమ దయనీయ పరిస్థితిపై ఫిర్యాదు చేసిన తమను అధికారులు దుర్భాషలాడారని బంధువులు ఆరోపిస్తున్నారు.