నవంబర్ 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు | Winter session of Parliament to commence on November 16 | Sakshi
Sakshi News home page

నవంబర్ 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Oct 13 2016 6:22 PM | Updated on Sep 4 2017 5:05 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 16 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 16 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. సర్జికల్ దాడులు, కశ్మీర్ లో సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరిగిన వర్షాకాల సమావేశాల్లో కీలక జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement