Sakshi News home page

‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’

Published Sun, May 20 2018 4:29 PM

We Retaliate Against Such Incidents Says Raman Singh - Sakshi

సాక్షి, రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ  సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై  ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్‌ అన్నారు.

మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్‌ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement