Sakshi News home page

రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు

Published Mon, Jul 24 2017 1:36 AM

రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో శుభ్రమైన తాగునీటిని అందించేందుకు 1,100 వాటర్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసే ఈ యంత్రాల ద్వారా 300 ఎం.ఎల్‌ నీళ్ల బాటిల్‌ను కేవలం రూ.1కే అందజేయనున్నట్లు ట్వీటర్‌లో పేర్కొంది. అంతేకాకుండా 500 ఎం.ఎల్‌ బాటిల్‌ను రూ.3కు, లీటర్, రెండు లీటర్ల బాటిళ్లను రూ.5, రూ.8కే అందించనున్నట్లు తెలిపింది. దీనివల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement