యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి | UPSC issue: English marks not to be included for grading in prelims | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి

Aug 21 2014 1:58 AM | Updated on Sep 22 2018 7:37 PM

యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి - Sakshi

యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి

వచ్చే ఆదివారం నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగంలోని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయవలసిన అవసరంలేదని యూపీఎస్సీ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను

 ఇంగ్లిష్ పరీక్షపై నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్
 
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగంలోని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయవలసిన అవసరంలేదని యూపీఎస్సీ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంపై రిట్‌పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు తగిన వేదిక కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

ఇంగ్లీష్ ప్రశ్నలు వదిలేయండి

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పులకు సంబంధించి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సీశాట్-2గా పిలిచే ప్రిలిమ్స్ రెండో పేపర్‌లో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కాంప్రహెన్షన్ స్కిల్స్ విభాగంలో అభ్యర్థులకు వచ్చే మార్కులను గ్రేడింగ్‌లో పరిగణించబోమని అందులో స్పష్టం చేసింది. పేపర్-1(సీశాట్-1)లో 200 మార్కులకు గాను సాధించే మార్కులు, పేపర్-2లో ఇంగ్లీష్ విభాగం మార్కులు తీసేయగా వచ్చే మార్కులను కలిపి మెరిట్‌ను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆంగ్ల భాషా నైపుణ్యానికి సంబంధించిన 9 ప్రశ్నలకు(22.5 మార్కులు) సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని వదిలిపెట్టవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ నెల 24న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. సీశాట్-2లో ప్రశ్నల సరళిపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement