ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు | trial of Italian marines as witnesses don't appear | Sakshi
Sakshi News home page

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు

Aug 5 2013 9:09 PM | Updated on Sep 1 2017 9:40 PM

గతంలో ఇటలీ నావికుల కేరళం తీరంలో ఇద్దరు జాలర్లను కాల్చి చంపిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి పురోగతి కనబడలేదు.

 న్యూఢిల్లీ: ఇటలీ నావికుల కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో హోంశాఖ ఆ బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించింది. భారత్ సముద్ర జలాల్లో మత్య వేటకు వెళ్లిన ఇద్దరు కేరళకు చెందిన మత్యకారులను మాసిమిలియానో లాతోర్, సాల్వతోర్ గిరోన్ అనే ఇద్దరు ఇటలీ నావికులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.

 

గతంలోనే ఈ ఉదంతంపై వామపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతకుముందు బీజేపీ నేతలు ఇటలీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత్‌ను ఇటలీ తేలికగా తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement