వీఐపీ కల్చర్‌.. ట్రాఫిక్‌ జామ్‌లోనే... | Traffic Jam Due to CM Event kills Man in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

వీఐపీ కల్చర్‌.. ట్రాఫిక్‌లోనే కన్నుమూశాడు

Aug 31 2017 10:42 AM | Updated on Oct 8 2018 3:17 PM

వీఐపీ కల్చర్‌.. ట్రాఫిక్‌ జామ్‌లోనే... - Sakshi

వీఐపీ కల్చర్‌.. ట్రాఫిక్‌ జామ్‌లోనే...

దేశానికి వీఐపీల కంటే సాధారణ పౌరులే ముఖ్యమని, వారి భద్రత గురించే ఆలోచించాలని...

సాక్షి, భోపాల్‌: ‘వీఐపీలు కాదు.. దేశానికి సాధారణ పౌరులే ముఖ్యం’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. 
 
భోపాల్‌ గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన సాజిద్‌ అలీ అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విదిశా పట్టణం కగ్‌పూర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో ఓ రైతు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రైతులను తీసుకెళ్తున్న బస్సులో సాజిద్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గుండెపోటుతో కుప్పకూలిపోగా, పోలీసుల సహకారంతో డ్రైవర్ ఓ ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఇంతలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో తలమునకలైన సిబ్బంది మూలంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంబులెన్స్‌ చాలా సేపు ఆ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయింది. పైగా ఓ ఎమ్మెల్యే కారే ఆంబులెన్స్ కు అడ్డుగా ఉండటం గమనార్హం. చుట్టూ జనం గుమిగూడగా, అంతా చూస్తుండగానే సాజిద్‌ ప్రాణాలు వదిలాడు. తర్వాత సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతికి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  ఎవ్రీ పర్సన్‌ ఇంపార్టెంట్‌ కల్చర్‌ రావాలంటున్న మోదీ, తన పార్టీ నేతలకు మాత్రం హిత బోధ చేయలేకపోతున్నారా? అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది.
 
టైమ్స్ నౌ వారి సౌజన్యంతో... 
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement