నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ | today Meetings of the Rajya Sabha | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ

Apr 23 2015 3:00 AM | Updated on Sep 3 2017 12:41 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు గురువారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు గురువారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి. ఇవి మే నెల 13 వరకు కొనసాగుతాయి. మొత్తం మీద ఈసారి 13 రోజులపాటు సభ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వేలు, 2015-16 సాధారణ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.

అలాగే ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను ఆమోదించాల్సి ఉంది.  తొలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగడం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement