3 లక్షల తరగతి పుస్తకాలు వెనక్కి! | Tamil Nadu government recalls over 3 lakh text books which listed DMK chief Karunanidhi as CM | Sakshi
Sakshi News home page

3 లక్షల తరగతి పుస్తకాలు వెనక్కి!

Jun 20 2015 12:10 PM | Updated on Sep 3 2017 4:04 AM

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరగతి పాఠ్యపుస్తకాల్లో కాలం చెల్లిన మూడు లక్షల పుస్తకాలను తమిళనాడు ఆ రాష్ట్ర విద్యా విభాగం తాజాగా తిరిగి వెనక్కు తెప్పించింది.

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రితమైన తరగతి పాఠ్య పుస్తకాల్లో మూడు లక్షల పుస్తకాల కాలం చెల్లి పోవడంతో  వాటిని ఆ రాష్ట్ర విద్యా విభాగం తాజాగా తిరిగి వెనక్కు తెప్పించింది. ఆ సమయంలో ప్రభుత్వం తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఇచ్చిన పుస్తకాల ముందుమాటలో ఆనాటి సీఎం కరుణానిధి పేరే ఇప్పటికీ ముద్రించి ఉండటమే.

 

దీంతో ఈ విషయాన్ని గ్రహించిన విద్యాశాఖ ఆ పుస్తకాలను తిరిగి వెనక్కు తెప్పించింది. అయితే  ఇది ప్రింటింగ్ తప్పిదం కాదని, 2011కి ముందు ముద్రించిన పుస్తకాలు కావటంతో అప్పటి సీఎం కరుణానిధి పేరు ముద్రించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. 2011లో  ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.  కానీ, 2014 లో పరిమితికి మించి ఆస్తులు కూడగట్టిన కేసులో పదవి కోల్పోయారు.  ఆ తరువాత పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా కొనసాగారు.  ఈ ఏడాది మే 23న జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్ధోషిగా తేల్చడంతో ఆమె తిరిగి సీఎం పదవిని పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement