భారతీయుల రక్షణపై అమెరికాను కోరాం: సుష్మా స్వరాజ్‌ | Sushma Swaraj comments about Indians security in US | Sakshi
Sakshi News home page

భారతీయుల రక్షణపై అమెరికాను కోరాం: సుష్మా స్వరాజ్‌

Mar 21 2017 2:23 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికాలో జాత్యంహకార హత్యకు గురైన శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో జాత్యంహకార హత్యకు గురైన శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. అమెరికాలోని భారతీయులకు రక్షణ కల్పించాలని ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

యూఎస్‌లో భారతీయులపై దాడుల అంశాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. శ్రీనివాస్‌ కూచిభొట్ల, వ్యాపారవేత్త హర్నీష్‌ పటేల్‌లు హత్యకు గురికావడం దిగ్బ్రాంతి కలిగించిందన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement