కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.
పార్టీ ఎంపీలతో సోనియా సమావేశం
Nov 16 2016 2:23 PM | Updated on Oct 22 2018 9:16 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. పెద్దనోట్ల రద్దుపై సామాన్యులు పడుతున్న బాధలపై పోరాడాలని ఆమె ఈ సందర్భంగా ఎంపీలకు సూచించారు. అలాగే సభలోనూ జనం తరఫున గళం వినిపించాలని సోనియా ఆదేశించారు. ఉభయసభల్లోనూ ఈ అంశంపై ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని సూచన చేశారు. కాగా పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ...ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Advertisement
Advertisement