ఎన్నో ప్రమాదాలు.. వేలాది మృతులు | So many train accidents and many deaths happen | Sakshi
Sakshi News home page

ఎన్నో ప్రమాదాలు.. వేలాది మృతులు

Jan 23 2017 3:00 AM | Updated on Sep 5 2017 1:51 AM

దేశంలో రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రమాదాలూ అదేస్థాయిలో చోటుచేసుకుం టున్నాయి.

సాక్షి, విశాఖపట్నం:  దేశంలో రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రమాదాలూ అదేస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. తూర్పు కోస్తా రైల్వే చరిత్రలో హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటనే అతి పెద్దది. ఈ ప్రమాదంలో 40 మంది మృత్యువాత చెందగా.. 71 మందికిపైగా గాయాలయ్యాయి.

దేశంలో ఘోర రైలు ప్రమాదాలను ఒకసారి గమనిస్తే..
► 1981 జూన్‌ 6: బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్‌ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
► 1995 ఆగస్టు 20: ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్‌ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు.
► 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్‌ వద్ద అవధ్‌–అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్‌ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 268 మంది మృతిచెందారు.
► 1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ–సీల్డా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. 212 మంది మరణించారు.
► 2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌జిల్లాలో లోకమాన్య తిలక్‌ జ్ఞానేశ్వరి సూపర్‌ డీలక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 170 మంది తుదిశ్వాస విడిచారు.
► 1964 డిసెంబర్‌ 23: తమిళనాడులో పాంబన్‌–ధనుష్కోటి ప్యాసింజర్‌ రైలు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు.
► 2002 సెప్టెంబర్‌ 9: హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బిహార్‌లోని గయ వద్ద పట్టాలు తప్పింది. 140 మంది కన్నుమూశారు.
► 2003 జూలై 2: వరంగల్‌ స్టేషన్‌ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. 21 మంది మృతిచెందారు.
► 2005 అక్టోబర్‌ 29: తెలంగాణలోని వలిగొండ వద్ద మూసి నదిపై బ్రిడ్జి కూలిపోయింది. అదే బ్రిడ్జిపై వెళ్తున్న డెల్టా ప్యాసింజర్‌ నదిలో పడిపోయింది. 114 మంది ప్రయాణికులు కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement