‘ఉర్దూ టీచర్లూ.. సంస్కృతం బోధించండి!’ | sanskrit tells urdu teachers | Sakshi
Sakshi News home page

‘ఉర్దూ టీచర్లూ.. సంస్కృతం బోధించండి!’

Jul 2 2015 8:58 AM | Updated on Sep 3 2017 4:45 AM

ఉర్దూ బోధిస్తున్న 40 మంది టీచర్లను సంస్కృతం బోధించాలంటూ రాజస్తాన్ ప్రభుత్వం వారిని వివిధ స్కూళ్లకు బదిలీ చేసింది.

బుండీ: ఉర్దూ బోధిస్తున్న 40 మంది టీచర్లను సంస్కృతం బోధించాలంటూ రాజస్తాన్ ప్రభుత్వం వారిని వివిధ స్కూళ్లకు బదిలీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో నాలుక  కరుచుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉర్దూ విద్యార్థులు లేని బుండీ, ఝలావర్, బరన్‌లోని పాఠశాలల్లో ఉన్న ఉర్దూ టీచర్లను వేరే ప్రాంతాల్లోని మాధ్యమిక పాఠశాలల్లో సంస్కృతం బోధించాలని బదిలీ చేశామని మాధ్యమిక విద్యాశాఖ(కోట) డెరైక్టర్ డీడీ మురళీ లాల్ తెలిపారు. ఈ బదిలీల్లో పొరపాటు జరిగిందని, దీన్ని సరిదిద్దుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement