వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు.
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. ఉత్తరాదిలో ‘వాద్రా’ సంస్థ జరిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు.