రైలు చార్జీల పెంపు కూత? | Rail fare hike proposal under examination: Kharge | Sakshi
Sakshi News home page

రైలు చార్జీల పెంపు కూత?

Oct 4 2013 1:12 AM | Updated on Sep 1 2017 11:18 PM

రైల్వే ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు.

ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం: మంత్రి ఖర్గే
 న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఏసీ)ను అనుసరించి చార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని మంత్రి గురువారం నాడిక్కడ చెప్పారు. సంస్థ వ్యయం, మార్కెట్ పరిస్థితులకనుగుణంగా ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా రుసుములపై ప్రతీ ఆర్నెల్లకోసారి సమీక్షించాలని రైల్వే యోచిస్తున్న సంగతి తెలిసిందే.
 
 ఈ లెక్కల ప్రకారం వచ్చే ఆర్నెల్లలో ఇంధనం, ఇతర ఉత్పత్తి వ్యయం పెంపు దృష్ట్యా రైల్వే రూ. 1,200 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రయాణికుల సేవలపై ప్రభుత్వం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ ఇప్పటికే రూ. 26,000 కోట్లు దాటింది. సరుకు రవాణా రుసుం గత ఏప్రిల్ నుంచి ఎఫ్‌ఏసీ ఆధారంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. ఈ ఏడాది జనవరిలోనే ప్రయాణికుల చార్జీలను పునఃసమీక్షించాల్సి ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోలేదు. ఇంధన ధరల పెంపుతో పడుతున్న రూ. 850 కోట్ల అదనపు భారాన్నీ రైల్వేనే భరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement